న్యూఢిల్లీ: లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) రెండో ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు డెహ్రాడూన్, రాంచీ, జమ్ము, విశాఖపట్నం, సూరత్ నగరాల్లో లెజెండ్స్ లీగ్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయిం ట్స్, సదరన్ సూపర్ స్టార్స్, బిల్వారా కింగ్స్ పోటీపడుతున్నాయి. అయితే రెండో సీజన్కు ప్రచారం కల్పించడంలో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎల్ఎల్సీ ట్రోఫీ టూర్ నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.