Vasim Jaffer : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించాలంటే టామ్ లాథమ్ వికెట్ కీలకమని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మంగళవారం జాఫర్ మాట్లాడుతూ.. మిడిల్ ఓవర్లలో లాథమ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటాడు. అందుకని అతని వికెట్ కీలకం అని చెప్పాడు. మూడో వన్డేలో లాథమ్ నుంచే భారత్కు ముప్పు ఎక్కువని, అతని వికెట్ కోసం భారత జట్టు ప్రణాళికలు రచించాలి అని జాఫర్ తెలిపాడు. జట్టులో ఏమైనా మార్పులు చేయాలా? అన్న ప్రశ్నకు అవసరం లేదని, రెండో వన్డే జట్టుతోనే బరిలోకి దిగాలని బదులిచ్చాడు. రంజీ ట్రోఫీలో వసీం జాఫర్కు తిరుగులేని రికార్డు ఉంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు వీరుడు తనే.
మొదటి వన్డేలో న్యూజిలాండ్ 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లాథమ్ కీలక పాత్ర పోషించాడు. 20 ఓవర్లలోపు న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేసింది. కానీ, ఆ తర్వాత లాథమ్ దూకుడు పెంచడంతో కివీస్ జట్టు మ్యాచ్పై పట్టు సాధించింది. ఆ మ్యాచ్లో లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులు చేశాడు. రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేద్దామనుకున్న భారతజట్టుకు నిరాశే మిగిలింది. వర్షం కారణంగా రెండో వన్డే రద్దయింది. క్రిస్ట్చర్చ్లో రేపు మూడో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది.