ముంబై: యార్కర్ కింగ్ లసిత్ మలింగ తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుతో చేరనున్నాడు. 2021లో ఐపీఎల్కు వీడ్కోలు పలికిన లంక మాజీ పేసర్.. వచ్చే సీజన్లో ముంబై పేస్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించనున్నాడు.
సుదీర్ఘంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న షేన్ బాండ్ స్థానాన్ని మలింగ భర్తీ చేయనున్నట్లు సమాచారం. గత రెండేండ్లుగా మలింగ.. రాజస్థాన్కు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.