కొలంబో: చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో జింబాబ్వేపై శ్రీలంక రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మంగళవారం రెండో వన్డేలో మొదట జింబాబ్వే 44.4 ఓవర్లలో 208 పరుగులు చేసింది. కెప్టెన్ ఇర్విన్ (82) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.