బర్మింగ్హామ్ : ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ శుభారంభం చేశారు. మంగళవారం తొలి రోజు పోటీలలో ప్రణయ్ అతి కష్టంపై 21-19, 22-20 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జు వీపై గెలుపొందగా, లక్ష్యసేన్ 21-18, 21-19తో అయిదో సీడ్, తైపీకే చెందిన చౌ టీన్ చెన్ను మట్టికరిపించాడు. మరో మ్యాచ్లో ఎనిమిదో సీడ్, సింగపూర్కు చెందిన లో కీన్ యె 16-21, 21-16, 7-21తో చైనాకు చెందిన జావొ జంగ్పెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కాగా మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ వ్యక్తిగత కారణాలతో పోటీనుంచి తప్పుకుంది. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి ప్రత్యర్థులు పోటీనుంచి తప్పుకోవడంతో రెండో రౌండ్కు చేరుకున్నారు.