హైదరాబాద్, ఆట ప్రతినిధి: చైనా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు రాష్ర్టానికి చెందిన ధుర్వి లకోటియా ఎంపికయ్యాడు. ఎల్బీ స్టేడియంలో స్కేట్బోర్డింగ్ శిక్షణ పొందిన లకోటియా..భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సాట్స్ స్కేటింగ్ కోచ్ జితేందర్ గుప్తా సోమవారం పేర్కొన్నాడు.