చెన్నై: ప్రపంచ చాంపియన్ కోనేరు హంపి పేరును అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఖేల్త్న్ర పురస్కారానికి సిఫారసు చేసింది. ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్న 34 ఏండ్ల హంపి.. గతేడాది ర్యాపిడ్ చెస్ ప్రపంచ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు యువ ఆటగాళ్లు విదిత్, అధిబన్, సేతురామన్, లలిత్బాబు, భక్తి కులకర్ణి, పద్మిని పేర్లను అర్జున అవార్డు కోసం పంపింది.