భారత క్రికెట్లో ప్రస్తుతం అతి పెద్ద స్టార్లు ఎవరంటే టక్కున నోటికి వచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అయితే వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అలాంటివేమీ లేవని వీళ్లు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్సుల్లో చెప్పినా ప్రయోజనం మాత్రం శూన్యం.
ఇప్పటికీ ట్విట్టర్లో ఈ ఇద్దరు ప్లేయర్ల ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ చేసిన పని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇది కోహ్లీకి వందో టెస్టు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత జట్టు ఫీల్డింగ్కు రెడీ అయింది.
ఆటగాళ్లందరూ మైదానంలోకి వచ్చేస్తున్నారు. కోహ్లీ కూడా మైదానంలోకి వచ్చాడు. అయితే వెంటనే అతన్ని ఆపేసిన రోహిత్.. వెనక్కు వెళ్లి మళ్లీ మైదానంలోకి రావాలని కోహ్లీని వెనక్కు పంపేశాడు. కోహ్లీ అలా మళ్లీ మైదానంలోకి వచ్చేటప్పుడు జట్టు ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి కోహ్లీకి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ గౌరవం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
दूसरा वीडियो pic.twitter.com/4tDKaOCyiZ
— रोहित जुगलान Rohit Juglan (@rohitjuglan) March 5, 2022
A very sweet gesture by Indian Captain Rohit Sharma 🥺❤️ #INDvsSL #viratkholi #RohitSharma𓃵 pic.twitter.com/Ovr2Xb7K3G
— AAYUSHHH 🇮🇳 (@bebaslachara_) March 5, 2022