భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన టెస్టు కెప్టెన్గా రికార్డులకెక్కిన విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్ సారథ్యానికి వీడ్కోలు పలికాడు. వన్డే కెప్టెన్సీ నుంచి చెప్పకుండా తప్పించారనే కోపమో! లేక దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ పరాజయం బాధించిందో గానీ యాంగ్రీ యంగ్మన్ కెప్టెన్సీకి టాటా చెప్పేశాడు! మహేంద్రసింగ్ ధోనీ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ తన బ్యాటింగ్ ైస్టెల్తోనే కాకుండా.. బాడీ లాంగ్వేజ్తోనూ ప్రత్యర్థులకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. భారత జట్టుకు అత్యధిక టెస్టు విజయాలు అందించిన నాయకుడిగా చరిత్రకెక్కిన కోహ్లీ.. సంప్రదాయ ఆటకు
సరికొత్త జోష్తో సొబగులద్దిన మాట మాత్రం ముమ్మాటికి వాస్తవం!!
కేప్టౌన్: సుదీర్ఘ ఫార్మాట్లో విజయవంతమైన భారత కెప్టెన్గా చరిత్రకెక్కిన విరాట్ కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ పరాజయం తర్వాత విరాట్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా శనివారం ప్రకటించాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పొట్టి ఫార్మాట్ సారథ్యానికి వీడ్కోలు పలకనున్నట్లు స్పష్టం చేసిన కోహ్లీని.. సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ నుంచి చెప్పకుండానే తప్పించారు. ఈ అంశంపై బోర్డుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కోహ్లీ.. ఇప్పుడు చెప్పాపెట్టకుండా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
‘దాదాపు ఏడేండ్ల పాటు సారథిగా జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశా. బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించా. ప్రతి దానికి ముగింపు అనేది ఉంటుంది. నా టెస్టు కెప్టెన్సీకి కూడానూ. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. అయితే కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు. విజయం కోసం 120 శాతం కృషి చేశానని బలంగా నమ్ముతున్నా. బీసీసీఐ, రవిశాస్త్రి, ధోనీకి ధన్యవాదాలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుదీర్ఘ లేఖలో పేర్కొన్నాడు. 2014లో ఆస్ట్రేలియా పర్యటన సమయంలో మహేంద్రసింగ్ ధోనీ టెస్టులకు గుడ్బై చెప్పడంతో జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ ఏడేండ్ల కాలంలో ఎన్నో అద్వితీయ విజయాలందించాడు. స్వదేశంతో పాటు.. విదేశాల్లోనూ ప్రత్యర్థులకు ఢీ అంటే ఢీ అంటూ దూకుడైన స్వభావంతో జట్టును ముందుకు నడిపిన కోహ్లీ ఇకపై ఆటగాడిగా మరిన్ని ఘనతలు సాధించాలని తాజా, మాజీ క్రికెటర్లు ఆకాంక్షించారు.
హ్యాట్సాఫ్ కోహ్లీ
శుభాకాంక్షలు విరాట్! ఏడేండ్లుగా జట్టును అద్భుతంగా ముందుకు నడిపావు. నీ అంకితభావం, నిబద్ధతతో అసలైన లీడర్గా నిలిచావు. టేక్ ఏ బో బ్రదర్. – కేటీఆర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి
కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తాం
విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. అతడి సారథ్యంలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించింది. సారథిగా తప్పుకోవడం విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బోర్డు గౌరవిస్తుంది. భవిష్యత్లో ఓ ఆటగాడిగా కోహ్లీ జట్టు కోసం మరిన్ని విజయాలు సాధించాలి. భారత జట్టుకు కెప్టెన్గా అపారమైన సేవలు అందించిన విరాట్కు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెబుతున్నా. – గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
రాజకీయాలకు వేదికగా బీసీసీఐ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా రాకతో బీసీసీఐ రాజకీయాలకు వేదికగా మారింది. క్రికెట్లో ప్రతి ఆటగాడు సంతృప్తికరమైన స్థాయికి చేరుకున్న తర్వాత వీడ్కోలు పలకడం సహజం. బీసీసీఐ కార్యదర్శిగా జై షా ప్రవేశంతో పరిస్థితులు భిన్నంగా మారాయి. బోర్డు రాజకీయాలకు నిలయమవడంతో ప్రతిభావంతులు రాణించలేకపోతున్నారు. ఎంపికలో రాజకీయాలు జరుగుతున్నాయి. -కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి