లండన్: వన్డే క్రికెట్లో రారాజుగా వెలుగొందుతున్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన ఘనత దక్కింది. 2010 దశాబ్దానికి గాను అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ప్రతిష్ఠాత్మక క్రికెట్ మ్యాగజీన్ విజ్డెన్ అల్మనాక్లో కోహ్లీ నిలిచాడు. 2008లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ ఇప్పటి వరకు 254 మ్యాచ్ల్లో 60 సగటు, 42 శతకాలతో 12,169 పరుగులు చేశాడు. అలాగే ‘విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్’్డగా ఇంగ్లండ్ ఆల్రౌండర్ స్టోక్స్ వరుసగా రెండోసారి ఘనత దక్కించుకున్నాడు. కాగా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1990 దశాబ్దానికి అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ఎంపికయ్యాడు. అలాగే భారత ప్రపంచకప్ హీరో కపిల్దేవ్ 1980 దశాబ్దానికి అత్యుత్తమ ఆటగాడిగా అవార్డు దక్కించుకున్నాడు. మరోవైపు ఏడాది అత్యుత్తమ క్రికెటర్లుగా సిబ్లే, క్రాలీ, హోల్డర్, రిజ్వాన్, స్టీవెన్స్ 2021 విజ్డెన్ ఎడిషన్లో చోటు దక్కించుకున్నారు.