IPL 2024 RR vs RCB : జైపూర్ గడ్డపై విరాట్ కోహ్లీ(72) తొలి హాఫ్ సెంచరీ బాదాడు. తొలి ఓవర్ నుంచి దంచుతున్న విరాట్.. పరాగ్ ఓవర్లో సిక్సర్ బాది ఫిఫ్టీ సాధించాడు. ఈ సీజన్లో కోహ్లీకి ఇది మూడో అర్ధ శతకం. మరో ఎండ్లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ డూప్లెసస్ 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్లో బట్లర్ చేతికి చిక్కాడు.
అంతకుముందే బౌల్ట్ క్యాచ్ వదిలేయడంతో బతికి పోయిన డూప్లెసిస్ ఆ తర్వాత బంతికే షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. దాంతో, 125 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు. 14 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్… 125/1.
ICYMI – @imVkohli brought a well made half-century with a MAXIMUM 🔥💥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
LIVE – https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/g03v0YkZvO
— IndianPremierLeague (@IPL) April 6, 2024
టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. బెంగళూరు జట్టు గత మ్యాచ్లో విఫలమైన అనుజ్ రావత్ స్థానంలో సౌరవ్ చౌహన్ను తీసుకుంది. జోరు మీదున్న రాజస్థాన్ ఏ మార్పులు లేకుండా ఆడుతోంది.
మహిళల జీవితాల్లో మార్పు తేవాలనే ఆలోచనతో రాజస్థాన్ ఆటగాళ్లు పింక్ జెర్సీ ధరించి ఆడుతున్నారు. పింక్ ప్రామిస్లో భాగంగా.. ఆర్ఆర్, ఆర్సీబీ మ్యాచ్లో బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్కు ఆరు ఇండ్లలో సౌర వెలుగులు నింపనుంది. అవును.. ఒక్కో సిక్సర్కు ఆరు చొప్పున సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనుంది.