వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ నెల చివర్లో వెస్టిండీస్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చారు. గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. విండీస్తో పొట్టి ఫార్మాట్ నుంచి రెస్ట్ కావాలని సెలెక్టర్లను కోరగా.. అందుకు తగ్గట్లే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ గురువారం 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
విరాట్తో పాటు పనిభారం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా, స్పిన్నర్ చాహల్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ చాన్నాళ్ల తర్వాత జట్టులోకి రాగా.. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్కు టీమ్లో చోటు దక్కింది. సిరీస్కు ముందు వీరిద్దరూ ఫిట్నెస్ నిరూపించుకోవాలని బోర్డు పేర్కొంది. భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 29న ట్రినిడాడ్ వేదికగా తొలి టీ20 జరుగనుంది.
భారత జట్టు: రోహిత్ (కెప్టెన్), ఇషాన్, సూర్యకుమార్, హుడా, శ్రేయస్, కార్తీక్, పంత్, పాండ్యా, జడేజా, అక్షర్, అశ్విన్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, అవేశ్, హర్షల్, అర్శ్దీప్, రాహుల్, కుల్దీప్.