చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ పోరాటం ముగిసింది. శనివారం జహహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 12-15, 12-15, 11-15తో కొచ్చి బ్లూస్పైకర్స్ చేతిలో ఓటమిపాలైంది.
ఏ దశలోనూ కొచ్చికి దీటైన పోటీనివ్వలేకపోయిన హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది. టోర్నీలో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింటిలో ఓడిన హైదరాబాద్ రెండు పాయింట్లతో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది.