న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కుడి తొడ గాయానికి మంగళవారం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరుతానని రాహుల్ ఆశాభావం వ్యక్తంచేశాడు.
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ ఈ నెల ఆరంభంలో బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా గాయపడి ఐపీఎల్కు, వచ్చే నెలలో జరిగే డబ్ల్యుటీసీ ఫైనల్కు దూరమైన సంగతి తెలిసిందే.