న్యూఢిల్లీ: గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన టీమ్ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జర్మనీలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సారథిగా ఎంపికైన రాహుల్.. గాయం కారణంగా చివరి నిమిషంలో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ‘గత రెండు వారాలుగా నొప్పితో ఇబ్బంది పడ్డా. శస్త్రచికిత్స విజయవంతమవడంతో ఇక తిరిగి కోలుకోవడంపై దృష్టి పెట్టా’ అని రాహుల్ గురువారం ట్వీట్ చేశాడు.