ముంబై: భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజా పరీక్షల్లో అతడికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో విండీస్తో జరుగనున్న టీ20 సిరీస్లో రాహుల్ ఆడటం అనుమానంగా మారింది.
ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. రాహుల్తో పాటు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొననున్న భారత మహిళల జట్టులోనూ ఒకరికి కరోనా సోకినట్లు దాదా వెల్లడించాడు. ఇటీవల జర్మనీలో హెర్నియా చికిత్స తీసుకొని కోలుకున్న కేఎల్ రాహుల్కు ప్రస్తుతం విండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.