KL Rahul | భారత్ – వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానుంది. ఆ తర్వాత 29 నుంచి ఐదు మ్యాచ్ల టీ-20 సిరీస్ జరుగనున్నది. వన్డే సిరీస్లో పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అదే సమయంలో టీ20 సిరీస్ కోసం చాలా మంది ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రానున్నారు. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లున్నారు. గాయం తర్వాత కేఎల్ రాహుల్ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ తర్వాత గాయపడ్డ విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ కరోనా బారినపడ్డాడు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. గజ్జగాయంతో ఇబ్బందిపడుతుండగా.. ఇటీవల జర్మనీలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం కోలుకొని ఇంటర్నేషనల్ క్రికెట్లో పునరాగమానికి సన్నద్ధమవుతున్నాడు. ఇందుకోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను విండీస్ టూర్కి వెళ్లాలంటే ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా బారినపడ్డాడు. అలాగే కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొననున్న ఓ క్రీడాకారిణి సైతం పాజిటివ్గా తేలిందని బీసీసీఐ అధ్యక్షుడు తెలిపాడు.
అయితే, పేరును మాత్రం చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో రాహుల్ వెస్టిండీస్ టూర్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొద్ది రోజులు జట్టు విండీస్ టూర్కు బయలుదేరాల్సి ఉంది. అక్కడికి వెళ్లేందుకు కనీసం కరోనా నెగెటివ్ రిపోర్ట్ తీసుకోరావాల్సి ఉంటుంది. ఐపీఎల్ తర్వాత రాహుల్ ఐపీఎల్ తర్వాత రాహుల్కు కలిసి రావడం లేదు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే సిరీస్కు కెప్టెన్ ఎంపికయ్యాడు. సిరీస్కు ముందే కరోనా బారినపడడంతో దూరమయ్యాడు. ప్రస్తుతం విండీస్ టూర్కు ముందే కరోనాబారినపడ్డాడు.
శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (wk), సంజు శాంసన్ (wk), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ (కోలుకోవడంపై ఆధారపడి ఉంటుంది), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
మొదటి వన్డే : క్వీన్స్ పార్క్ ఓవల్, జూలై 22
రెండో వన్డే : క్వీన్స్ పార్క్ ఓవల్, జూలై 24
మూడో వన్డే : క్వీన్స్ పార్క్ ఓవల్, జూలై 27
మొదటి టీ20 : ట్రినిడాడ్, జూలై 29
రెండో టీ20: సెయింట్ కిట్స్, ఆగస్ట్ 1
మూడో టీ20: సెయింట్ కిట్స్, ఆగస్ట్ 2
నాల్గో టీ20: లాడర్హిల్, ఫ్లోరిడా, ఆగస్ట్ 6
ఐదో టీ20: లాడర్హిల్, ఫ్లోరిడా, ఆగస్ట్ 7