లక్నో: ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్కు రెండు కొత్త జట్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అహ్మాదాబాద్, లక్నో జట్లకు టీమ్ కెప్టెన్లును కూడా ఆయా ఫ్రాంచైజీలు కూడా సెలక్ట్ చేశాయి. లక్నో ఐపీఎల్ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఆర్పీఎస్జీ గ్రూపు ఆ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నది. అయితే రాహుల్ను 17 కోట్లకు కోనుగోలు చేసింది ఆ టీమ్. ఈసారి అత్యధికంగా అమ్ముడుపోయిన ఐపీఎల్ క్రికెటర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. లక్నో జట్టు ఆసీస్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ను 9.2 కోట్లకు సొంతం చేసుకున్నది. లెగ్ స్నిన్నర్ రవి బిష్ణోయ్ను 4 కోట్లకు కొన్నది. ఇక ఐపీఎల్ మెగా వేలం పాట ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగుళూరులో జరుగుతుంది. ఆ వేలంలో ఐపీఎల్ జట్ల మిగితా ప్లేయర్లను తీసుకుంటాయి. ఐపీఎల్ సీజన్లో అత్యధిక స్థాయిలో అమౌంట్ అందుకుంటున్నవారిలో కోహ్లీ, ధోనీ సరసన రాహుల్ చేరాడు. 2018లో ఆర్సీబీ కోహ్లీకి 17 కోట్లు ఇచ్చింది. కానీ ఈ సీజన్కు అతనికి 15 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో 17 కోట్లు తీసుకున్న సీఎస్కే కెప్టెన్ ధోనీ.. ఈ సీజన్కు 12 కోట్లకే ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.