న్యూఢిల్లీ: స్టార్ ఓపెనర్ లోకేశ్ రాహుల్.. భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ కోసం ముందు రోహిత్ శర్మను వైస్ కెప్టెన్గా నియమించినా.. అతడు గాయం కారణంగా సిరీస్కు దూరమవడంతో రోహిత్ స్థానాన్ని రాహుల్తో భర్తీ చేశారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం ఒక ప్రకటన విడుదల చేశాడు. ‘సఫారీ గడ్డపై జరుగనున్న మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ కేఎల్ రాహుల్ను వైస్కెప్టెన్గా ఎంపిక చేసింది’ అని జై షా తెలిపాడు.