CWC 2023: వన్డే వరల్డ్ కప్లో ఆడిన ఏడు మ్యాచ్లకు ఏడింటిలో గెలిచి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్న భారత క్రికెట్ జట్టు.. టీమిండియా వైస్ కెస్టెన్ హార్ధిక్ పాండ్యా సేవలను కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు ముందు పాండ్యా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. హార్ధిక్ పాండ్యా స్థానాన్ని టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ భర్తీ చేస్తుండగా టీమిండియా వైస్ కెప్టెన్సీ పగ్గాలను మాత్రం కెఎల్ రాహుల్ కు అప్పజెప్పింది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా తప్పుకోవడంతో ఈ మెగా టోర్నీలో బీసీసీఐ.. రోహిత్కు డిప్యూటీగా కెఎల్ రాహుల్ను నియమించింది. ఇదే విషయాన్ని టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ శనివారం ఉదయమే అతడికి తెలిపాడు. అగార్కర్ కూడా టీమ్తోనే ట్రావెల్ చేస్తున్నాడు..’ అని అన్నాడు.
KL Rahul appointed as Vice Captain of team India in this World Cup.
Recovering from injury to proving his worth and now becoming VC in the World Cup, a comeback to remember by KL…!!! pic.twitter.com/D1cA8IqxXe
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 4, 2023
కాగా ప్రపంచకప్లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ హార్ధిక్ ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చికిత్స తీసుకున్నాడు. శ్రీలంకతో మ్యాచ్కు ముందు అతడు ముంబైలో టీమిండియాతో కలవడంతో కనీసం సెమీస్ వరకైనా టీమ్తో కలుస్తాడని భావించినా బీసీసీఐ మాత్రం సడెన్ షాక్ ఇవ్వడంతో భారత అభిమానులు షాక్కు గురయ్యారు.