ముంబై: ప్రేమపక్షులు కేఎల్ రాహుల్, అతియా శెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొన్నేండ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ యువ జంట..మరో మూడు నెలల వ్యవధిలో ఒకటి కాబోతున్నట్లు తెలిసింది. ఇందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ముంబైలో జరిగే వివాహ వేడుకకు రెండు కుటుంబాలకు చెందిన వారు హాజరవనున్నారు. గాయం నుంచి కోలుకుంటున్న రాహుల్..ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు దూరం అయ్యాడు.