కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. జిడ్డు ఆట ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ మీదకు రస్సెల్ వేసిన బంతిని ఫైన్ లెగ్ మీదకు ఆడటానికి విలియమ్సన్ ప్రయత్నించాడు. కానీ బంతిని మిస్ అవడంతో అది ఆఫ్స్టంప్ను కూల్చింది. దీంతో విలియమ్సన్ ఇన్నింగ్స్ ముగిసింది.
కేవలం 30 పరుగులకే సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. విలియమ్సన్ అవుటవడంతో యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠీ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో సన్రైజర్స్ జట్టు పవర్ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.