కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టుకు శుభారంభం లభించలేదు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (2) నిరాశపరిచాడు. జోస్ బట్లర్ (22) కూడా బ్యాటు ఝుళిపించలేకపోయాడు. ఇలాంటి క్రమంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత భుజాలకు ఎత్తుకున్న సంజూ శాంసన్ (54) భారీ షాట్లు ఆడలేకపోయాడు.
తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (13), రియాన్ పరాగ్ (19) కూడా నిరాశపరిచారు. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ (27 నాటౌట్) మంచి షాట్లు ఆడాడు. అశ్విన్ (6 నాటౌట్) అతనికి పూర్తి సహకారం అందించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లతో సత్తా చాటగా.. శివమ్ మావి, అనుకూల్ రాయ్, ఉమేష్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.