రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్గా దిగిన బాబా ఇంద్రజిత్ (15)ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. ప్రసిద్ధ్ వేసిన ఆరో ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదిన ఇంద్రజిత్.. తర్వాతి బంతిని పుల్ చేసేందుకు ప్రయత్నించాడు.
అయితే టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ దాన్ని అందుకోవడంతో ఇంద్రజిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ప్లే ముగిసే సమయానికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది.