కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తడబడుతోంది. భారీ షాట్లు ఆడటానికి ఆ జట్టు బ్యాటర్లు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే రియాన్ పరాగ్ (19) కూడా పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ వేసిన 17వ ఓవర్ ఐదో బంతికి భారీ సిక్సర్ కొట్టిన పరాగ్.. ఆ తర్వాతి బంతిని కూడా బౌండరీ దాటించడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో లాంగాన్లో అనుకూల్ రాయ్కు చిక్కాడు. అదే సమయంలో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్న కెప్టెన్ సంజు శాంసన్ క్రీజులోనే ఉన్నప్పటికీ అతను కూడా భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. ఇదే క్రమంలో శివమ్ మావి వేసిన 18వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడే క్రమంలో రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మావి వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ను శాంసన్ గాల్లోకి లేపాడు. అయితే అది ఎక్కువ దూరం ప్రయాణించలేదు. దీంతో డీప్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న రింకూ సింగ్ దాన్ని అందుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు 115 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.