పంజాబ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. స్కోరు బోర్డు వేగంగా పెరుగుతున్నప్పటికీ వారి వికెట్లు కూడా చాలా వేగంగా పడిపోతున్నాయి. తొలి ఓవర్లోనే మయాంక్ అవుట్ కాగా.. నాలుగో ఓవర్లో రాజపక్స (31) పెవిలియన్ చేరాడు. ఇప్పుడు తొలి పవర్ప్లే చివరి ఓవర్లో స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ (16) పెవిలియన్ చేరాడు. సౌతీ వేసిన బంతిని ముందుకొచ్చి బాదడానికి ధవన్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో బంతిని మిస్ చేయడంతో అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ శామ్ బిల్లింగ్స్ చక్కగా అందుకున్నాడు. దీంతో ధావన్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. పవర్ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 62/3 స్కోరుతో నిలిచింది. స్కోరు బాగానే ఉన్నా కీలకమైన వికెట్లు కోల్పోవడం ఆ జట్టుకు సమస్యగా మారే అవకాశం ఉంది.