లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (0), అభిజిత్ (4) విఫలమవడంతో కేకేఆర్ పని అయిపోయినట్లే అనుకున్నారు. అయితే నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ ముందుకు నడిపారు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన వీళ్లిద్దరూ కోల్కతాను ఆదుకున్నారు. దీంతో కేకేఆర్ జట్టు పవర్ప్లే ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.