కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కేకేఆర్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో 215 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ.. కోల్కతాకు గెలిచే అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (18), అజింక్య రహానే (8)ను తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చిన పేసర్ ఖలీల్ అహ్మద్.. ఢిల్లీకి అద్భుతమైన ఆరంభం అందించాడు.
ఆ తర్వాత కోల్కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (54), నితీష్ రాణా (30) గెలుపుపై ఆశలు కల్పించారు. కానీ ఆండ్రీ రస్సెల్ (24) పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, శామ్ బిల్లింగ్స్ (15) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో కేకేఆర్ ఓటమి ఖరారైంది. అప్పటికీ ప్యాట్ కమిన్స్ (4) క్రీజులో ఉండటంతో కొంత ఆశలు ఉన్నప్పటికీ కుల్దీప్ యాదవ్ అతన్ని అవుట్ చేసి వాటిని కూడా ఆవిరి చేశాడు.
ఆ ఓవర్లో మూడు వికెట్లు తీసిన కుల్దీప్.. ఢిల్లీ విజయాన్ని దాదాపు ఖరారు చేశాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో బంతి అందుకున్న శార్దూల్ ఠాకూర్.. రస్సెల్, రస్కిన్ సలామ్ (7) వికెట్లు తీసి కేకేఆర్ కథ ముగించాడు. దీంతో ఢిల్లీ జట్టు 44 పరుగుల తేడాతో కోల్కతాపై ఘనవిజయం నమోదు చేసింది.