కోల్కతా : ఐపీఎల్-19 ప్రారంభానికి ముందే గాయపడి టోర్నీ కి దూరమైన కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పేసర్ ఆకాశ్ దీప్ స్థానాన్ని ఆ ఫ్రాంచైజీ సౌరభ్ దూబేతో భర్తీ చేసింది. 28 ఏండ్ల ఈ విదర్భ బౌలర్ ఇప్పటికీ ఐపీఎల్లో ఆడకపోయినా నిరుటి సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్నాడు.
అబుదాబిలో జరిగిన ఐపీఎల్ మినీవేలంలో దూబేను ఎవరూ పట్టించుకోకపోయినా ఈ లెఫ్టార్మ్ పేసర్ తమకు ఆకాశ్ లేని లోటును భర్తీ చేస్తాడని కేకేఆర్ ఆశిస్తున్నది.