కోల్కతా : పంజాబ్ కింగ్స్తో సోమవారంనాటి మ్యాచ్లో స్లోఓవర్ రేట్కుగాను కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణాకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో కోల్కతా జట్టు తొలి తప్పిదంగా నిబంధనల ప్రకారం జరిమానా విధించినట్టు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కాగా రింకూ సింగ్ మరోసారి తన విలువను తెలియజేస్తూ చివరి బంతికి బౌండరీతో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్ రాణా అర్ధసెంచరీ, రస్సెల్ మెరుపులు, రింకూ 10 బంతుల్లో 21 పరుగులతో కోల్కతా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.