Jacob Duffy : వన్డేల్లో కివీస్ బౌలర్ జాకబ్ డఫీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. మూడు వికెట్లు తీసి అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా రికార్డు సాధించాడు. ఇండోర్లో భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో అతను 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి 100 పరుగులు ఇచ్చాడు. అంతకుముందు బంగ్లాదేశ్ బౌలర్ షఫిహుల్ ఇస్లాం 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి 95 రన్స్ సమర్పించుకున్నాడు. ఓపెనర్ రోహిత్, గిల్ అతని బౌలింగ్లో ధారాళంగా పరుగులు రాబట్టారు. డఫీ ఈ మ్యాచ్లో కీలకమైన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ఔట్ చేశాడు.
నామమాత్రమైన మూడో వన్డేలో భారత్ 385 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభ్మన గిల్ (112), రోహిత్ శర్మ (101) సెంచరీలతో చెలరేగారు. హార్దిక్ పాండ్యా (54), శార్దూల్ ఠాకూర్(25)తో కలిసి స్కోర్ను 350 దాటించాడు.ఇప్పటికే రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.