Ishan Kishan : భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు యాక్సిడెంట్లో గాయపడ్డాడనే వార్త తెలియగానే క్రికెటర్లతో పాటు అభిమానులు షాక్ అయ్యారు. ఫ్యాన్ ద్వారా పంత్ కారు ప్రమాదం గురించి తెలుసుకున్న యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా ఆశ్చర్యపోయాడు. అతను ఆ రోజు జంషెడ్పూర్లోని కీనన్ స్టేడియంలో జార్ఘండ్ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. జార్ఘండ్-సర్వీసెస్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇషాన్ ఫీల్డింగ్ చేస్తుండగా.. పంత్కు యాక్సిడెంట్ అయింది అని ఒక అభిమాని చెప్పాడు. దాంతో, ఇషాన్ ఏంటీ? ఏం మాట్లాడుతున్నావు? అంటూ ఇషాన్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
డిసెంబర్ 30వ తేదీన ఉదయం 5 గంటలకు రిషభ్ పంత్ డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పంత్ నిద్రమత్తులో ఉండగా కారు డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఉత్తరాఖండ్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయం కారణంగా పంత్, ఫిబ్రవరిలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్తో పాటు ఐపీఎల్ 2023 సీజన్కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. దాంతో ఆసీస్తో జరిగే టెస్టు సిరీస్కు అతని ప్లేస్లో మరో ఆటగాడిని బీసీసీఐ ఎంపిక చేయనుంది. పంత్ స్థానం కోసం ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్, భరత్ మధ్య పోటీ నెలకొంది. బంగ్లాదేశ్ సిరీస్లో కెరీర్లో తొలి, వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ వైపే మాజీ క్రికెటర్లు మొగ్గు చూపుతున్నారు.