సార్బుక్రెన్ (జర్మనీ): భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మ ‘హైలో ఓపెన్’లో ముందంజ వేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో ఆరో సీడ్ శ్రీకాంత్ 21-15, 21-10తో కొకి వాంటడే (జపాన్)ను ఓడించాడు. 32 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి తర్వాతి రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఇదే విభాగంలో మరో షట్లర్ సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే మాక్స్ విస్కిర్చన్ (జర్మనీ) వైదొలగడంతో వాకోవర్తో ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాడు. ఇక స్టార్ షట్లర్ ప్రణయ్ 21-16, 17-21, 7-21తో నాట్ ఎంగుయాన్ (ఐర్లాండ్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా, మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్ 7-21, 21-23తో నెలిషాన్ ఇగిట్ (టర్కీ) చేతిలో ఓడింది.