హైదరాబాద్, ఆట ప్రతినిధి: తమిళనాడు వేదికగా జరుగుతున్న 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు ఆశీర్వాద్ సక్సేనా, నిశిక అగర్వాల్ పసిడి పతకాలతో మెరిశారు. సోమవారం జరిగిన 1కి.మీ వ్యక్తిగత సైక్లింగ్ ట్రాక్ ఈవెంట్లో ఆశీర్వాద్ 1:12:652 సెకన్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో వేదాంత్ జితేంద్ర(మహారాష్ట్ర), గుర్నూర్ పునియా(హర్యానా) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
మరోవైపు అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో నిశిక అగర్వాల్ 42.95 స్కోరుతో స్వర్ణ పతకం సాధించింది. సౌమిలి(పశ్చిమబెంగాల్), సారా(మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల సౌత్జోన్ వుషూ పోటీల్లో రాష్ర్టానికి స్వర్ణం, మూడు రజతాలు, 18 కాంస్య పతకాలు లభించాయి.