హైదరాబాద్, ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో తెలంగాణ యువ స్విమ్మర్ సాయి నిహార్ బిక్కిన పతక జోరు కనబరిచాడు. మంగళవారం జరిగిన పురుషుల 200మీటర్ల మెడ్లె ఈవెంట్లో బరిలోకి దిగిన నిహార్(కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ) 2:12:88సెకన్ల టైమింగ్తో టాప్లో నిలిచి స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు.
ఉత్సబ్ దత్తా (వెస్ట్బెంగాల్ యూనివర్సిటీ), మణికంఠ (జైన్ యూనివర్సిటీ) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. అదే జోరు కొనసాగిస్తూ 200మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో 2:12:90సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో సుభాశిష్ డే, ఆర్యన్ భోంస్లే రజత, కాంస్యాలు కైవసం చేసుకున్నారు.