హైదరాబాద్, ఆట ప్రతినిధి: జమ్ము కశ్మీర్ వేదికగా జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో రాష్ట్ర ప్లేయర్లు సత్తాచాటారు. ఐస్ స్కేటింగ్లో ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. బాలికల 15 నుంచి 19 ఏండ్ల వయసు విభాగంలో నయన శ్రీ తాళ్లురి రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది.
బాలుర 500మీ, 1000మీటర్ల విభాగంలో ప్రణవ్ మాధవ్ రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకోగా, విష్ణువర్ధన్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ పోటీపడటం ఇది తొలిసారి. గత రెండు పర్యాయాలు రాష్ట్ర ప్లేయర్లకు ఆహ్వానం దక్కలేదు.