WPL | బెంగళూరు: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి విజయం నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన యూపీ.. బుధవారం 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబైని చిత్తుచేసింది. మొదట ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఓపెనర్ హీలీ మాథ్యూస్ (55; 9 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించింది.
అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్ అవతారమెత్తిన కిరణ్ నవగిరె (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. (17 బంతుల్లో 38; 6 ఫోర్లు, ఒక సిక్సర్), హీలీ (33) దంచికొట్టారు. లీగ్లో భాగంగా గురువారం బెంగళూరుతో ఢిల్లీ తలపడనుంది.