Virat Kohli | హోరాహోరీ పోరాటాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. అనూహ్య ఫలితాలతో గ్రూప్ దశ ముగియగా.. బుధవారం సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా అన్ని జట్లు కీలక సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా సైతం సెమీ ఫైనల్ మ్యాచ్కు సిద్ధమవుతోంది. గురువారం జరిగే సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడనుంది.
ఈ మెగా టోర్నీలో భారత జట్టు మాజీ సారథి, కోహ్లీ మంచి ఫామ్లో ఉన్న విషయం తెలసిందే. కీలక మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో విరాట్.. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ఇది చూసిన ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్.. కోహ్లీని సెలవు తీసుకోవచ్చుగా అంటూ సరదాగా అభ్యర్థించాడు. ‘గురువారం డే ఆఫ్ తీసుకోవచ్చు కదా.. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు కూడా తెలుసు. కానీ రేపు ఒక్కరోజు విశ్రాంతి తీసుకో ప్లీజ్’ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం పీటర్స్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.