కన్నూరు: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్(Sreesanth)పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. శ్రీశాంత్తో పాటు మరో ఇద్దరిపై ఆ కేసు బుక్కైంది. కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన సారీశ్ గోపాలన్ అనే వ్యక్తి ఆ కేసును ఫైల్ చేశాడు. చూండాకు చెందిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఏప్రిల్ 25, 2019 నుంచి రాజీవ్ కుమార్, వెంకటేశ్ కిని అనే ఇద్దరు వ్యక్తులు తన వద్ద సుమారు 18.70 లక్షలు తీసుకున్నారని, కర్నాటకలోని కొల్లూరులో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు వాళ్లు చెప్పారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. అయితే ఆ అకాడమీలో శ్రీశాంత్ పార్ట్నర్గా ఉన్నాడు. అకాడమీలో భాగస్వామ్యం ఇస్తారని చెప్పడం వల్లే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపాడు. ఐపీసీ 420 సెక్షన్ కింద శ్రీశాంత్తో పాటు మరో ఇద్దరిపై కేసు బుక్ చేశారు. ఆ కేసులో శ్రీశాంత్ను మూడవ నిందితుడిగా చేర్చారు.