హైదరాబాద్, ఆట ప్రతినిధి: రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలైన ఒలింపిక్స్, ఆసియాగేమ్స్ కోసం ఏర్పాటు చేస్తున్న జాతీయ అథ్లెటిక్స్ శిబిరానికి సాంఘిక సంక్షేమ గురుకుల యువ అథ్లెట్ కీర్తన ఎంపికైంది. ఐవోసీఎల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద దేశవ్యాప్తంగా 30 మంది ప్రతిభ కల్గిన అథ్లెట్లను ఎంపిక చేయగా, అందులో రాష్ట్రం నుంచి కీర్తనకు అవకాశం లభించింది.
వరంగల్ ఎస్సీ గురుకుల అథ్లెటిక్స్ అకాడమీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న కీర్తనను అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించింది. భవిష్యత్లో కీర్తన మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.