Kedar Jadhav | ఐపీఎల్లో తన జిడ్డు ఆటతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న కేదార్ జాదవ్.. రంజీ ట్రోఫీలో చితగ్గొట్టాడు. అసోంతో జరుగుతున్న రంజీ పోరులో డబుల్ సెంచరీ చేసి తనపై ఉన్న చెడ్డపేరును చెరిపేసుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా అసోం-మహారాష్ట్ర మధ్య ఆట కొనసాగుతున్నది. ఐపీఎల్ వేలం సమయంలో సెంచరీ సాధించి ఉంటే బాగుండేదని క్రికెట్ ఫ్యాన్స్ సానుభూతి ప్రకటిస్తున్నారు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఆక్షన్లో ఏ ఫ్రాంచైజీ కూడా కేదార్ జాదవ్ పేరును కనీసం పరిశీలంచలేదు. దాంతో ఈ ఏడాది ఆయన ఐపీఎల్కు దూరమైనాడు. అయితే, అసోంతో జరుగుతున్న రంజీ పోటీలో మహారాష్ట్ర తరఫున ఆడుతున్న కేదార్ జాదవ్.. డబుల్ సెంచరీ సాధించి విమర్శకులకు దీటైన సమాధానమిచ్చారు. 207 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 200 పరుగులు రాబట్టాడు. కేదార్ అద్భుతమైన ప్రదర్శనకు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గత ఐపీఎల్లో తన జిడ్డు ఆటతో కేదార్ అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు.
అసోంతో జరుగుతున్న మ్యాచ్ మూడో సెషన్లో కేదార్ జాదవ్ డబుల్ సెంచరీ సాధించడంతో మహారాష్ట్ర మొత్తం 5 వికెట్ల నష్టానికి 452 ల భారీ ఆధిక్యాన్ని అందుకున్నది. కేదార్ 218 బంతులాడి 205 పరుగులు చేశాడు. ఇంత బాగా రాణిస్తున్న ఆటగాడిని ఏ ఒక్క ఫ్రైంచైజీ కూడా తీసుకోవడంపై దృష్టి సారించలేదని క్రికెట్ ఫ్యాన్స్ కేదార్పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ వేలానికి కన్నా ముందే ఈ డబుల్ సెంచరీ సాధించి ఉంటే.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కేదార్ కోసం పోటీపడేవని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.