హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయస్థాయి టెన్నిస్ టోర్నీల్లో రాష్ట్ర యువ ప్లేయర్ గంటా సాయికార్తీక్ రెడ్డి అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. బిలాయ్(చత్తీస్గఢ్) వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టోర్నీలో సాయికార్తీక్, రిషబ్ అగర్వాల్ జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్లో కార్తీక్, రిషబ్ ద్వయం 4-6, 6-4, 11-9తో చంద్రిల్ సూద్, లక్ష్యసూద్ జంటపై విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయిన కార్తీక్ జోడీ వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించింది.