జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, విదర్భ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో కర్ణాటక 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ను చిత్తు చేయగా.. ఉత్తరప్రదేశ్ 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ను మట్టికరిపించింది. ఇక మూడో మ్యాచ్లో విదర్భ 34 పరుగుల తేడాతో త్రిపురపై విజయం సాధించింది. మంగళవారం జరుగనున్న క్వార్టర్ ఫైనల్స్లో హిమాచల్ ప్రదేశ్తో ఉత్తరప్రదేశ్, తమిళనాడుతో కర్ణాటక తలపడనుండగా.. బుధవారం జరుగనున్న మ్యాచ్ల్లో సౌరాష్ట్రతో విదర్భ.. సర్వీసెస్తో కేరళ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
పాండే కెప్టెన్ ఇన్నింగ్స్
ఆదివారం జరిగిన నాకౌట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 41.4 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. దీపక్ జగ్బీర్ (109) శతక్కొట్టగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. అనంతర సులువైన లక్ష్యఛేదనలో కర్ణాటక 43.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 204 పరుగులు చేసింది. సిద్ధార్థ్ (85 నాటౌట్), సమర్థ్ (54), కెప్టెన్ మనీశ్ పాండే (52) అర్ధశతకాలతో రాణించారు. మరో మ్యాచ్లో నిర్ణీత 50 ఓవర్లలో విదర్భ 7 వికెట్లకు 258 పరుగులు చేసింది. అథర్వ (51), యష్ రాథోడ్ (57) హాఫ్సెంచరీలు నమోదు చేశారు. ఛేదనలో త్రిపుర 49.2 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది.