Mayank Agarwal | అగర్తలా:కర్ణాటక రంజీ టీమ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం కుదుటపడుతున్నది. త్రిపురతో రంజీ మ్యాచ్ ముగించుకుని ఢిల్లీ బయల్దేరిన మయాంక్..విమానంలో గుర్తు తెలియని ద్రవం తాగి దవాఖాన పాలయ్యాడు. అయితే వైద్యుల నిరంతర పర్యవేక్షణతో తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు మయాంక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. త్వరలోనే తిరిగి జట్టులోకి వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. క్లిష్ట సమయంలో అభిమానులు తనపై చూపించిన ప్రేమకు మయాంక్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపాడు.