బెంగుళూరు: ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన రోహన్ బొప్పన్న(Rohan Bopanna)కు కర్నాటక సీఎం సిద్ధరామయ్య భారీ నగదు నజరానా ప్రకటించారు. రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన అతనికి సీఎం సిద్ధరామయ్య కంగ్రాట్స్ తెలిపారు. బొప్పన్నను తన కుటుంబసభ్యుల మధ్యే సత్కరించారు. ఐటీశాక మంత్రి ప్రియాంకా ఖర్గే, మంత్రి శివరాజ్ తంగదై కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెన్స్ డబుల్స్ కేటగిరీలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన మూడవ ఇండియన్గా బొప్పన్న నిలిచాడు. గతంలో భారత టెన్నిస్ ఆటగాళ్లలో లియాండర్ పేస్, మహేహ్ భూపతి మాత్రమే మెన్స్ డబుల్స్లో టైటిల్స్ను సొంతం చేసుకున్నారు. ఇక మహిళల కేటగిరీలో సానియా మీర్జా డబుల్స్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. బొప్పన్న తన కేరీర్లో రెండు గ్రాండ్ స్లామ్ టైటిలను కైవసం చేసుకున్నాడు. అతను ఫ్రెంచ్ ఓపెన్ కూడా గెలిచాడు.
ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಓಪನ್ ಟೆನಿಸ್ ಟೂರ್ನಿಯ ಪುರುಷರ ಡಬಲ್ಸ್ ವಿಭಾಗದಲ್ಲಿ ಪ್ರಶಸ್ತಿ ಗೆದ್ದು ಐತಿಹಾಸಿಕ ಸಾಧನೆ ಮಾಡಿದ @rohanbopanna ಅವರನ್ನು ಭೇಟಿಯಾಗಿ ಅಭಿನಂದಿಸಿ, 50 ಲಕ್ಷ ರೂ.ಗಳ ಬಹುಮಾನ ಘೋಷಿಸಿದೆ.
ಸಚಿವರಾದ @PriyankKharge, ಶಿವರಾಜ ತಂಗಡಗಿ, ಮುಖ್ಯಮಂತ್ರಿಯವರ ರಾಜಕೀಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಗೋವಿಂದರಾಜು ಹಾಗೂ ರೋಹನ್ ಬೋಪಣ್ಣ ಅವರ… pic.twitter.com/kRA0ftRoq4— Siddaramaiah (@siddaramaiah) February 13, 2024