కరాచీ: పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో కేన్ విలియమ్సన్(105 నాటౌట్) అజేయ సెంచరీతో న్యూజిలాండ్ను ఆధిక్యంలో నిలిపాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 440 పరుగులు చేసి రెండు పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. విలియమ్సన్, ఇష్ సోధీ(1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రెండో రోజు అర్ధసెంచరీ చేసిన ఓపెనర్ టామ్ లాథమ్ సెంచరీ(113) పూరించగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(92) ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీ అవకాశం కోల్పోయాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3, నౌమన్ అలి 2 వికెట్లు దక్కించుకున్నారు.