వెల్లింగ్టన్: మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (215; 23 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు హెన్రీ నికోల్స్ (200 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) ద్విశతకాలతో రెచ్చిపోవడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. వీరిద్దరు దంచి కొట్టడంతో కివీస్ 580/4 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. విలియమ్సన్కు ఇది ఆరో టెస్టు డబుల్ సెంచరీ కాగా.. నికోల్స్తో కలిసి అతడు మూడో వికెట్కు 363 పరుగులు జోడించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.