న్యూఢిల్లీ: కొరియా వేదికగా జరిగిన షూటింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో కమల్జీత్ పసిడి పతక జోరు కనబరిచాడు. సోమవారం జరిగిన పురుషుల 50మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లో కమల్జీత్ రెండు పసిడి పతకాలతో మెరిశాడు.
వ్యక్తిగత కేటగిరీలో కమల్జీత్ 544 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. టీమ్ ఈవెంట్లో కమల్జీత్, అనికేత్ తోమర్, సందీప్ బిష్ణోయ్తో కూడిన భారత త్రయం 1617 స్కోరుతో స్వర్ణం సొంతం చేసుకుంది. టోర్నీలో భారత్ 17 పతకాలు దక్కించుకుంది.