జూలపల్లి: వయసు అనేది ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించాడు జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కల్లెం మహేందర్రెడ్డి. ఆసక్తి ఉండాలే కానీ ఎంచుకున్న రంగంలో అద్భుతంగా రాణించవచ్చని చేతల్లో చూపించాడు ఈ వెటరన్ అథ్లెట్. మలేషియా వేదికగా జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో మహేందర్రెడ్డి రజత పతకంతో మెరిశాడు. 60 ఏండ్ల విభాగం 200 మీటర్ల రేసులో రెండో స్థానంలో నిలిచి ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చిన ఈయన ప్రదర్శన పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ లక్ష్మణ్, నరసింహం, వెంకటేశం తదితరులు అభినందనలు తెలిపారు.