బెంగుళూరు: ఐపీఎల్ 2022 సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల వేలం బెంగుళూరులో జరుగుతున్నది. మొత్తం పది ఫ్రాంచైజీలు క్రికెటర్ల కోసం పోటీపడుతున్నాయి. ఇవాళ మొదటి రోజు ఆక్షన్లో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ దక్కించుకున్నది. రబడా 9.25 కోట్లకు అమ్ముడుపోయాడు. శిఖర్ ధావన్ను పంజాబ్ కింగ్స్ 8.25 కోట్లను కొనుగోలు చేసింది. 5 కోట్లకు అశ్విన్ను రాజస్థాన్ సొంతం చేసుకున్నది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ను కేకేఆర్ జట్టు 7.25 కోట్లకు కొన్నది. 8 కోట్లకు ట్రెంట్ బౌల్ట్ను రాజస్థాన్ ఎగురేసుకుపోయింది.
ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్తో పాటు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ గెయింట్స్ ఈ వేలంలో పాల్గొంటున్నాయి. 15వ ఎడిషన్ ఐపీఎల్ టోర్నీ మార్చి చివరలో ప్రారంభంకానున్నది.